Thursday, October 18, 2012

పాదయాత్రకు జననీరాజనం

వినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన రాజకీయ పార్టీలన్నీ జగన్‌ని లక్ష్యంగా పావులు కదుపుతున్న వైనం ప్రజలకు అవగతమవుతోంది.

సి.బి.ఐ, ఇ.డి.లు ఇతర కేసుల్లో ఇంతటి అత్యుత్సాహం చూపకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ కక్షసాధింపు ధోరణికి దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకుంటున్న తెరవెనుక భాగోతం తేటతెల్లమవుతోంది. జగన్‌ని ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక ఆయన ఇమేజ్‌పై బురద చల్లే చిల్లర ప్రయోగాలు కోర్టు కేసులు. జగన్‌ని తగ్గించాలనుకున్న పార్టీలు అంతకు రెట్టింపు నష్టపడి ఓడిపోవడం ఖాయం. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత నిత్యసత్యం. జగన్ జైలులో ఉన్నా, బయట ఉన్నా ఒకటే. విజయమ్మ సారథ్యంలో పార్టీ ముందుకు సాగాలని ప్రజల ప్రబల ఆకాంక్ష. ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగన్ చెల్లెలు షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. వైఎస్‌ఆర్ పాదయాత్రకు మించి షర్మిలమ్మ పాదయాత్రకు జనం నీరాజనం పలకాల్సిన తరుణమిది. 

జనసంక్షేమం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన పెద్దాయన కుటుంబం చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ప్రార్థనలు జరుపుతున్నారు. నిత్యం దేవుడిని వేడుకుంటున్నారు. జనం ఇప్పుడు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి జగన్ సీఎం పీఠం అధిష్ఠించాలని రాష్ట్ర ప్రజల కోరిక. రాజకీయ మాయల మరాఠీల చెర నుంచి జగనన్న వీరోచితంగా బయటపడే మంచికాలం కోసం రాష్ట్రజనం పడిగాపులు కాస్తున్నారు. జనానికి దారి చూపించే నాయకుడు జగనన్న వెంట జనం ఎప్పుడూ ఉంటారు.

- పి.సునీల్, పెద్దకొట్టాల, నంద్యాల

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...