Monday, February 25, 2013

నాశనమైపోతున్నాం

చుక్క చినుకు లేదు.. కరెంటు రానే రాదు
అదను మీద కురవాల్సిన వానలు కళ్లాల మీద పడ్డాయి
మూడేళ్ల నుంచీ అప్పుల బాధలేనంటూ ఆవేదన
ఆదుకునే నాథుడు లేడంటూ ఆక్రందన
త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా
ఇప్పుడు కాకపోతే... ఇంకెప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పాలని చంద్రబాబుకు డిమాండ్
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 74, కిలోమీటర్లు: 1,046.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరెంటేమో మూడు గంటలకు మించి రాదు. అది కూడా మూడు సార్లు మాత్రమే ఇస్తారు. పొలానికి పోయి ఎదురు చూసీ చూసీ ఇంటికి వస్తే అప్పుడు కరెంటొస్తది. పరిగెత్తుకొని పొలానికి పోయే సరికి మళ్లీ పోద్ది. పూతల మీద చుక్క చినుకు రాలలేదు.. తీరా పంట కోతకొచ్చాకా కళ్లాల మీద వానలు పడుతున్నాయి. మూడు ఎకరాల్లో.. అన్ని పెట్టుబడులూ కలుపుకొని రూ.2.10 లక్షలు ఖర్చు చేసి మిరప వేస్తే 18 క్వింటాళ్లు వచ్చింది. రూ. లక్ష వచ్చింది. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏం చేసి నా పిల్లలను బతికించుకోను?’’
... ఇనపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు కోరకూటి వెంకటేశ్వర్లు అవేదన.

‘‘భూమినే నమ్ముకున్న. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడాది పండక పోతుందా! అని అప్పులు చేసి మూడు ఎకరాల్లో మిరప తోట పెట్టినా. అదను మీద వాన పడలేదు. కరెంటు లేక మొక్కలు ఎండిపోయాయి. ఆయిల్ ఇంజన్‌పెట్టి తోట తడిపితే ఎకరానికి రూ. 2,500 కిరాయి. ఆరు తడులు పెట్టినా.. నేను, నా కొడుకూ..నా భార్యా అందరం రెక్కలు ముక్కలు చేసుకుంటే ఎకరానికి 8 క్వింటాళ్ల మిరప పట్టింది. దాన్ని తీసుకొని మార్కెట్‌కు పోతే కాటా పెట్టకముందే వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. తడిసిన మిరప కొనబోమని చెప్తే తీసుకొచ్చి ఇంటి ముందు పోసినా. పంటను నమ్ముకొని నాశనమై పోయినాం’’... తక్కెళ్లపాడుకు చెందిన మిరప రైతు అంజిరెడ్డి కన్నీళ్లు..

గుంటూరంటే గుర్తుకొచ్చేది మిరపకాయ ఘాటు. దయలేని పాలకుల ఏలుబడిలో ఆ మిరపే ఇప్పుడు అప్పుల పాలు చేసి రైతుల కంట ఇలా కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రజల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ఇలా రైతన్నలు ఆమె వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్ర 74వ రోజు సోమవారం షర్మిల మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇనపరాజుపల్లి గ్రామ శివారులో షర్మిల మిరప కళ్లాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న రైతులను పలకరిస్తే ‘‘మూడేళ్ల నుంచీ పంట లేదమ్మా.. భూమిని నమ్ముకొని నాశనమై పోయాం.. ఆదుకునే దేవుడు రాకుంటే ఆత్మహత్యలకు అంతే ఉండదమ్మా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజన్న రాజ్యంలో రైతే రాజు..

మిరప రైతు కన్నీళ్లను చూసిన షర్మిల గాదెవారిపల్లిలో జరిగిన రచ్చబండలో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరును ఘాటుగా విమర్శించారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని, రాజన్న రాజ్యంలో రైతే రాజు అని భరోసా ఇచ్చారు. ‘‘ఇది మనసులేని ప్రభుత్వం.. వీళ్లు రైతుల రక్తం పిండుకొని తాగుతున్నారు. వాళ్లకు ఉన్న సమయమంతా పదవులు కాపాడుకోవడానికి, ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.

బాబూ రైతుల కన్నీళ్లు కనిపించడంలేదా?

‘‘చంద్రబాబూ మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా? మరి మీకు ఈ ప్రజల కన్నీళ్లూ, కష్టాలూ కనిపించడం లేదా? రైతన్నలు అప్పుల బాధతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. మరికొంత మంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కాకుంటే ఈ ప్రభుత్వంపై ఎప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పండి. మీరు అవిశ్వాసం పెట్టరు. ఎందుకంటే ప్రజలు ఎటు పోయినా మీకు పట్టదు. మీరు బాగుంటే చాలు. అవిశ్వాసం పెట్టకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడతారు. అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం మీరు చేసిన అవినీతి పనుల మీద ఎలాంటి విచారణా వేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అది మీ ఇద్దరి మధ్యా కుదిరిన చీకటి ఒప్పందం’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

ప్రాణాలు తీసుకోవద్దు..

రైతులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ..‘‘అమ్మా..! అయ్యా..! ఒక్క మాటైతే భరోసా ఇచ్చి చెప్తున్నా.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వస్తుంది. రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోకుండా రూ. 3000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. అంత వరకు ఓపిక పట్టండి. దయచేసి మీ విలువైన ప్రాణాలు, భూమిని పోగొట్టుకోవద్దు’’ అని కోరారు.

సోమవారం 74వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తక్కెళ్లపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మాచర్ల నియోజకవర్గంలోని కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల మీదుగా సాగింది. షర్మిల 11.8 కిలోమీటర్ల మేర నడిచి.. రాత్రి 7.15 గంటలకు చిన కొదమగండ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,046.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, ఆతుకూరి ఆంజనేయులు, పి. గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ తదితరులు ఉన్నారు.

ఒక్క చెయ్యీ లేవలేదు..

ఆ ఊరి పేరు గాదెవారిపల్లె. 800 గడపలుంటాయి. షర్మిల వచ్చి ఊరి మధ్య రచ్చబండ మీద కూర్చున్నారు. మహిళలు చెప్తున్న సమస్యలు వింటున్నారు. వెంకటేశ్వర్లు అనే రైతు ముందుకొచ్చాడు. ‘అమ్మా నేను మాట్లాడతా’ అంటూ మైకందుకున్నాడు. ‘ఊరు ఊరంతా వచ్చి ఇక్కడే ఉంది.. గ్రామస్తులకు దండం పెడుతున్నా.. మన ఊరిలో హిందులువులున్నారు.. ముస్లింలు.. క్రిస్టియన్లూ ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, అన్నీ పార్టీలూ ఉన్నాయి. ఇంత మందిలో ఏ ఒక్కరైనా వైఎస్సార్ సంక్షేమ పథకాల నుంచి లబ్ధిపొందని వాళ్లు ఉంటే చేతులు లేపండి’ అని కోరాడు. షర్మిలతో పాటు అక్కడున్న నాయకులు దాదాపు 5 నిమిషాల పాటు వేచి చూశారు. ఒక్క చెయ్యంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు. ‘‘అదమ్మా వైఎస్సార్ మాకు చేసిన సాయం, వైఎస్సార్ మా గుండెళ్లో ఉన్నాడమ్మా’’ అని అన్నాడు. ఈ ఒక్క ఊరిలో రూ.1.70 కోట్ల రుణమాఫీ అయినట్లు వెంకటేశ్వర్లు చెప్పాడు.

Sunday, February 24, 2013

కిడ్నీలు అమ్ముకుంటున్నారు

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఆవేదన
ఈ పాలకుల నిర్లక్ష్యం నిండా ముంచింది
అకాల వర్షాలతో నష్టపోయినవారికి భరోసా ఇచ్చేవారే కరువయ్యారు
అవిశ్వాసంతో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాల్సిన చంద్రబాబు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035

 ‘‘పల్లెలు మళ్లీ కరువు కోరల్లో చిక్కి వల్లకాడుగా మారుతున్నాయి. అప్పులు చేసి భూమిలో విత్తనం వేసినా.. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట చేతికందలేదు. కొద్దోగొప్పో అందినా గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆదుకునే దిక్కులేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అప్పుల బాధలు తాళలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదాతకు అండగా నిలబడి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దింపాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సాగింది. దాచేపల్లి మండలం గామాలపాడు, నారాయణపురం గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు విన్నారు. ‘‘మూడు ఎకరాల మాగాణిలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినా. అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా. దేశం మొత్తం రైతులు ఇట్నే ఉన్నారమ్మా..’’ అని నారాయణపురానికి చెందిన నాగేశ్వర్‌రావు అనే రైతు చెప్పడంతో షర్మిల చలించిపోయారు. త్వరలోనే రైతన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. నారాయణపురంలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో షర్మిల రచ్చబండ వేదిక నుంచే మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇది రైతుల పట్ల చిత్తశుద్ధి లేని సర్కారు..

ఈ నెలలోనే అకాల వర్షాలు కురిశాయి. ఆరున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. నిజానికి ఇంతకన్నా మూడింతలు ఎక్కువగా నష్టం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నోటి కాడి ముద్ద నేలపాలయినట్లు మార్కెట్ యార్డుకు తెచ్చిన తర్వాత పత్తి, మిరప పూర్తిగా తడిసిపోయి రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా ఏ ఒక్క ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అధికారి కాని నష్టపోయిన రైతు వద్దకు వెళ్లి పలకరించ లేదు. పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇస్తామని రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి అకాల వర్షాలకే కాదు... నీలం తుపానుకు 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లైలా, జల్ తుపాన్ వచ్చినప్పుడు రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని సర్కారే అంచనా వేసింది. అయినా రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంతో తెలుసా? కేవలం రూ.17 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదీ మన పాలకులకు రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..

చంద్రబాబు గారు పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చెప్పగల సమర్థుడు ఆయన. చంద్రబాబు తన పాలన చాలా బాగుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన గారు ఏ చార్జీలను పెంచలేదట. 8 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. అవి కట్టలేమని రైతులు మొత్తుకున్నా వినలేదు. ప్రత్యేకంగా కోర్టులు, పోలీసు స్టేషన్లు పెట్టి రైతన్నలను చిత్రహింసలు పెట్టారు. ఆర్టీసీని బాదేశారు. గ్యాస్ ధర పెంచారు. అన్ని రకాల పన్నులు పెంచారు. అయ్యా..! నీ పరిపాలనలో రైతు కుటుంబాలు కుదేలై అప్పుల బాధలు ఒకవైపు, బిల్లుల కోసం పోలీసు స్టేషన్‌కు ఈడ్చితే ఆ అవమానం తట్టుకోలేక మరోవైపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ఇంకో మాట కూడా చెప్తున్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారట! ఈ మాట వింటే నవ్వొస్తుంది. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబునాయుడో.. ఈ కాంగ్రెస్ పార్టో అధికారంలోకి వస్తే అంతకన్నా శాపం మరోటి ఉండదు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏదో ఒక రోజున నిజం గెలుస్తుంది. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

ఆదివారం 73వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దాచేపల్లి మండలం శ్రీనగర్ నుంచి ప్రారంభమైంది. గామాలపాడు, నారాయణపురం మీదుగా దాచేపల్లికి చేరింది. అబద్ధపు కేసులతో జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు కట్టుకొని షర్మిలతో పాటు కదం తొక్కారు. రాత్రి 8.15 సమయంలో తక్కెళ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 14 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 1035 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున,లక్ష్మీరాజ్యం, పి.గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Wednesday, February 20, 2013

జగన్ ఒంటరి కాదు...జన సముద్రం


జగన్‌బాబును అరెస్టు చేసి సంబరపడుతున్న కాంగ్రెస్ పెద్దల కుట్రలను, దర్యాప్తు సంస్థల బుద్ధిహీనతను తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గమనిస్తూనే ఉంది. ఎన్నికలొచ్చినప్పుడు తెలుగుజాతి ఉగ్రగోదారై విజృంభించి కుటిల కాంగ్రెస్‌ను ముంచుతుంది. కేవలం జగన్‌బాబునే ఖైదు చేశామని ఢిల్లీపెద్దలు అనుకుంటున్నారు. జగన్‌తో పాటు ఆయనను అభిమానించే కోట్లాదిమందిని ఎమోషనల్‌గా ఖైదు చేశారు. 

జగన్ ఒంటరి కాదు, ఆయన జనసముద్రం. బీదవాడిని, బడుగువాడిని ప్రేమించడం జగన్‌కు తెలిసినట్టు దేశంలో మరే రాజకీయ నాయకుడికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ను తరిమి తరిమి కొట్టడానికి తెలుగుజాతి నిరీక్షిస్తోంది. జగన్‌కు కొంతకాలమే ఈ కష్టాలు. వీటన్నిటినీ ఆయన అధిగమిస్తారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడతారు. 
- ఈరెల్లి రాజబాబు, రాజమండ్రి

పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకో


టీడీపీ అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపాటు
ప్రజల మధ్య ఉన్నపుడేమో చేతగాని ప్రభుత్వం అని తిడతారు
అక్కడ్నుంచి వెళ్లగానే ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతారు
అవిశ్వాసం పెట్టమంటే పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు..?
చిరంజీవిలాగా పార్టీని కాంగ్రెస్ హైకమాండ్‌కు అమ్ముకోండి
 ‘‘చంద్రబాబుగారూ.. మీ తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు. ఇప్పుడు అవే పల్లెల వెంట తిరుగుతూ పాదయాత్ర అంటూ డ్రామాలాడుతున్నారు. మాకు చెప్పినట్టే మీకు కూడా ప్రజలు కష్టాలు కన్నీళ్లు చెప్పుకుంటున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు మీరే ఇది చేతగాని ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని ప్రజలకు చెప్పి అక్కడ్నుంచి తప్పించుకుంటున్నారు. అక్కడ్నుంచి బయట పడగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతావు. చంద్రబాబు గారు.. ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు? మీ డ్రామాలు ఆపండి. ఇన్ని నాటకాలు వేసే బదులు చిరంజీవిలాగా మీరు కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు మీ పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకోండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అంటూ నాలుగు వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కిరణ్, బాబు మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ప్రజలను, ప్రజా సమస్యలను ఏనాడో గాలికి వదిలేశారు. ఆయనకు ఉన్న సమయమంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పదవిని కాపాడుకోవడానికే సరిపోతోంది. చంద్రబాబు నాయుడు 8 ఏళ్ల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనలో మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు. లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పారు. చంద్రబాబు తన హయాంలో హైటెక్ సీఎం అని పేరు తెచ్చుకోవడానికే పాకులాడారు. వ్యవసాయం దండగ అన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమన్నారు. 4 వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడేమో రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఆయన కు నిజంగా రుణాలు మాఫీ చేసే ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ల మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. వైఎస్సార్ రైతన్న సంక్షేమం కోసం అనుక్షణం శ్రమించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు.

మీ అభిమానమే జగనన్నకు అండ..
నల్లగొండ జిల్లా పాదయాత్రలో నాతో పాటు కదం తొక్కిన నాయకులకు, విద్యార్థులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరున చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నా. మీ అభిమానమే జగనన్నకు అండ. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుమ్మక్కై అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నాలుగు గోడల మధ్య బంధించారు. మీ ప్రేమాభిమానాలతో జగనన్న జైల్లో కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ మీద ప్రజలెవరికీ భరోసా లేదు. ఎవరికైనా భరోసా ఉందా.. అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! ఆయన మీదున్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు. మ్యానేజ్ చేసుకుంటారు. పైకేమో ఇది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అంటారు. ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని తిడతారు. మరి అలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టు అంటే మాత్రం.. ఆ పని చేయనంటాడు.

మంగళవారం 71వ రోజు పాదయాత్ర దామరచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి దామరచర్ల మీదుగా విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 7.5 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,012 కి.మీ. యాత్ర పూర్తయింది. నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, గడ్డం స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, బోయపల్లి అనంతకుమార్, సత్యకుమారి, అల్కా శ్రావణ్‌రెడ్డి, కుంబం శ్రీనివాసరెడ్డి, పిట్టా రాంరెడ్డి, సిరాజ్‌ఖాన్, ఇరుగు సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

పాదయాత్రకు రెండు రోజుల విరామం..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు షర్మిల రెండు రోజులపాటు విరామం ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నమే షర్మిల పాదయాత్రను నిలిపివేశారు. దామరచర్ల మండలంలోని విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. బుధ, గురువారాల్లో కూడా షర్మిల ఇక్కడే ఉంటారు. తిరిగి 22వ తేదీ నుంచి యాత్రను పునఃప్రారంభిస్తారు. ప్రస్తుతం షర్మిల గుంటూరు జిల్లా సరిహద్దుకు మరో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా వాడపల్లి బ్రిడ్జి దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ రెండు రోజులు షర్మిల పార్టీ నాయకులను, ప్రజలను కలవరు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
మంగళవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 71, కిలోమీటర్లు: 1,012

Tuesday, February 19, 2013

ఆత్మీయస్పర్శను దూరం చేశారు


డైనమిజమ్, కమిట్‌మెంట్ కలిగిన నాయకుడు వై.ఎస్. జగన్. నిర్ణయం తీసుకుంటే, ఎంతటి కష్టమొచ్చినా నష్టమొచ్చినా తట్టుకోగలిగే గుండె దిటవు కలవాడు. ఆశ్రీతులను ఆదుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడు. రాజకీయ నాయకుడైతే తక్షణావసరాల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడయితే, భావితరాల గురించి కూడా ఆలోచించి, ప్రజలకు ఏది మంచో అది చేస్తాడు. అటువంటి రాజనీతిజ్ఞుడు జగన్‌బాబు. అటువంటి దృఢ సంకల్పం గల జగన్‌కు, ఈ ఆంక్షలు, అరెస్టులు అడ్డుకావు. కాలేవు. చిన్నతనంలోనే సమర్థ నాయకత్వం వహించి, ప్రజల కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలతో నేరుగా సంబంధబాంధవ్యాలు ఏర్పర్చుకుని వారి ఈతి బాధలు అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే. 

ఇంకా ఓదార్చవలసిన కుటుంబాలు మిగిలి ఉండగానే సగంలో ఆయన ఆత్మీయ స్పర్శను ప్రజల నుంచి ఈ ప్రభుత్వం లాగేసుకుంది. ఏ సంఘటనలోనైనా సానుకూల దృక్పథంతో చూడాలన్నది ఆర్యోక్తి. ఏది జరిగినా దానివల్ల జగన్‌కి, తద్వారా ప్రజలకి భవిష్యత్తులో మేలు జరుగుతుంది. విజయమ్మ, భారతి, షర్మిల గార్లు ధైర్యంగా ఉండవలసినదిగా మనవి. కలత చెందకండి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. దైవ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలు తాత్కాలికం. దైవం, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ జగన్‌కి ఉంటాయి. అవే ఆయనను కాపాడుతాయి. ఆయనకు విజయం చేకూరుస్తాయి.

- ఉద్దగిరి సతీష్‌బాబు, అనంతపల్లి, ప.గో.

ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్


నేను వైఎస్సార్ అభిమానిని మాత్రమే కాదు, జగన్ కోసం ప్రాణాలర్పించే తమ్ముణ్ని కూడా. జగన్ పేరు వినగానే అమ్మమ్మ, తాతయ్యల మొహంలో చిరునవ్వు, తల్లిదండ్రుల్లో ‘మా కొడుకు’ అన్న భావన, అన్నదమ్ములకు మరో తోబుట్టువు అన్న ధైర్యం వెల్లివిరుస్తాయి. అలాంటిది ఏ తప్పూ చేయని జగనన్నను జైలుపాలు చేయడం ఈ దుష్ట, నీచ రాజకీయ పరిపాలనకు నిదర్శనం. 

ఈ ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కావటం లేదు, మేం ఓట్లేసి గెలిపించింది సోనియాను చూసి కాదు, మా వైఎస్సార్‌ను చూసి అని. ఆ మహానుభావుడు రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చూసి. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఉచిత విద్యుత్తు... ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికీ నేనున్నాననే ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన చనిపోయాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అని కుంగిన సమయంలో ‘నేనున్నాను’ అంటూ మమ్మల్ని ఓదార్చి మాకు అండగా ఉన్న మా జగనన్నను జైల్లో పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు ఏమి చేయాలనుకుంటున్నారు?! వైఎస్సార్‌ని దోషిని చేశారు. జగనన్నని జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 

అసలు జగనన్న చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయటమా? విద్యార్థుల కోసం ఫీజు దీక్ష చేయటమా? రైతన్నల కోసం రైతు దీక్ష చేయటమా? కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టడమా? చనిపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడవడమా? ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఇవేవీ కావు. జగనన్న ఓ ప్రజానాయకుడు. ప్రజలు మెచ్చి, కోరుకునే నిజమైన నాయకుడు. జగన్ ‘పేదల పెన్నిధి’. కోర్టు వారికి నా మనవి: అయ్యా! నిస్వార్ధంగా సేవచేసే మా జగనన్నకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాం. జగన్‌ను విడుదల చేయండి. మంచిని కాపాడండి.

- దండే మధుకృష్ణ, పెంటపాడు, ప.గో.

సబ్సిడీలను ఎత్తివేసేందుకే...!

* మరోప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
* నాడు కేంద్రం గ్యాస్ ధర పెంచితే వైఎస్ తన మీద వేసుకున్నారు
* మహిళలకు వంటింటి భారం తగ్గించారు
* ఈనాటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు
* ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు కన్నీళ్లే!
* అవిశ్వాసంతో ప్రభుత్వాన్ని దింపేయకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
* వెయ్యి కి.మీ. పూర్తి చేసుకున్న మరో ప్రజా ప్రస్థానం


 ‘‘వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేయాలనుకున్నారు. మహిళా సాధికారత కోసం పరితపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచితే.. ఆ భారం నా అక్కాచెల్లెమ్మల మీద పడొద్దని వైఎస్సార్ తన మీద భారం వేసుకున్నారు. మహిళలకు వంటింటి భారాన్ని తగ్గించారు. ఇప్పుడున్న పాలకులు సబ్సిడీ గ్యాస్ నుంచి తప్పించుకోవడానికే సిలిండర్‌ను ఆధార్‌తో ముడిపెడుతున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని, త్వరలోనే ఈ కష్టాలు కడతేరే రోజు వస్తుందని హామీనిచ్చారు. 

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. సరిగ్గా దామరచర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్దకు చేరుకోవడంతో షర్మిల పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. అంతకుముందు ఆమె గూడూరులో గ్రామస్తులతో కలిసి రచ్చబండలో పాల్గొన్నారు. 

‘‘వైఎస్సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా తినలేకపోతున్నాం.. గ్యాస్ ధర.. బియ్యం, పప్పు.. ప్రతి వస్తువు ధర పెరిగింది. మా లాంటి పేదోళ్లకు కనీసం ఒక్కపూట భోజనం పెట్టడం కోసమైనా జగనన్న బయటికి రావాలి’’ అని మానస అనే మహిళ అన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. వైఎస్ మహిళల సంక్షేమం కోసం క్షణక్షణం తపించారన్నారు. నేటి పాలకులకు ఆ చిత్తశుద్ధి కరువైందని మండిపడ్డారు. తర్వాత కొండ్రపోలు కాల్వ వద్ద పార్టీ నాయకులు, అభిమానుల కోరిక మేరకు షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పాదయాత్ర రికార్డుల కోసం కాదు..
రికార్డుల కోసం పాదయాత్ర చేయడం లేదు.. పండుగలు చేసుకోవడం కోసం కాదు. వైఎస్సార్ పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారు. దేవుడి దయ, నాన్నగారి ఆశీస్సులతో జగనన్న తరపున చేస్తున్న ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మూడున్నర సంవత్సరాల కిందట వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచే రాష్ట్రం అతలాకుతలమైంది. పోయింది ఒక్క మనిషే కానీ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు కోలుకోలేదు.

ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది
పాదయాత్ర చేస్తూ ఏ గ్రామానికి వెళ్లినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా అప్పుల బాధలే. అన్ని బాధల్లోనూ ప్రజలు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అమ్మా.. నాయిన బతికున్నప్పుడు చాలా బాగుండేదమ్మా.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారే లేరమ్మా’ అని చెప్తున్నారు. జగనన్న మన మధ్య లేరని బాధపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్కమాట మటుకు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నా.. ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది. 

జగనన్న బయటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం దిశగా మనలను నడిపిస్తారు. ఎన్ని కుట్రలు పన్నేవాళ్లు ఉన్నా.. దేవుని దయ, నాన్నగారి ఆశీస్సులు... మీ ప్రేమానురాగాలతో జగనన్న ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చేటట్టు చేస్తారు. ఇంత దూరం.. ఇన్ని జిల్లాల్లో.. ఇన్ని గ్రామాల్లో.. ఇంతమంది ప్రజలు, నాయకులు మాకు ఎంతో సహాయం చేసి పాదయాత్రను జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 

బాబు ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు
చంద్రబాబు గారు.. పాదయాత్రల పేరుతో పల్లెల చుట్టూ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల కన్నీళ్లు.. కష్టాలు పట్టవు. పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అవసరం వస్తే అవిశ్వాసం పెడతానంటూ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఆయనకు ప్రజల మీద కంటే కుర్చీ మీదే ఆయనకు ప్రేమ ఎక్కువ. అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఆయన అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ ఆ పని చేయరు. అయితే దానికో లెక్కుంది.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

సోమవారం 70వ రోజు పాదయాత్ర ఎదులగూడెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గూడూరు, కిష్టాపురం, కొత్తగూడెం, కొండ్రపోలు గ్రామాల మీదుగా సాగింది. కొండ్రపోలు నుంచి 0.7 కిలోమీటర్లు నడిచి కొండ్రపోలు కాల్వకు చేరుకోవడంతోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినట్లు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. అబద్ధపు కేసులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగు గోడల మధ్య బంధించటాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 

కొండ్రపోలు కాల్వ నుంచి మరో 4.5 కిలోమీటర్లు నడిచి దామరచర్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 13.3 కి.మీ. నడిచారు. ఇప్పటిదాకా 1004.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, ఎర్నేని బాబు, బోయపల్లి అనంతకుమార్, సిరాజ్‌ఖాన్, ఎండీ సలీం, ఇరుగు సునీల్‌కుమార్, కేఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల రక్తదానం
పాదయాత్ర బడలికను పక్కనబెట్టి షర్మిల రక్తదానం చేశారు. మరో ప్రజాప్రస్థానం 1,000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రెడ్‌క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరంలో షర్మిల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. దాదాపు 400 మిల్లీలీటర్ల రక్తమిచ్చారు. ఆమె స్పూర్తితో దాదాపు 65 మంది రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన తర్వాత షర్మిల 4.5 కి.మీ. నడిచారు.

మహిళలకు చీరల పంపిణీ..
షర్మిల 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం అనంతరం షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహం వద్దే ఇళ్లు కట్టుకుంటా: సూర్యానాయక్
‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు రైతుల ముఖంలో నవ్వుండేది. ఇప్పుడది లేదు. షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు మా భూమి దగ్గరే పూర్తి కావడం మా అదృష్టం. మా కొడుకు ఒకరు పైలట్. మరో కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చదువు పూర్తయ్యాక కొడుకు అమెరికా వెళ్లినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడూ అంతే సంతోషం వేస్తోంది. వైఎస్సార్ విగ్ర హం వెనకాలే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు వైఎస్సార్ నా ఇంటి ముందే ఉంటాడు’’ అని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇచ్చిన గిరిజన రైతు సూర్యానాయక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు భూమిని దానం చేసిన సూర్యానాయక్ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు.

Sunday, February 17, 2013

ఏ మనిషికైనా ఒకటే న్యాయం జరగాలి



‘జగన్ కోసం... జనం సంతకం’ అంటూ సమాజంలో వైఎస్సార్సీపీ ప్రజాభిమానాన్ని స్వీకరించటం ఎంతైనా అభినందనీయం. ‘అసలు కోర్టులు, చట్టాలు ఎలా పుట్టుకొచ్చాయి?’ అనే ప్రశ్న ఉదయించినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో సమ సమాజంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా చట్టాలు, శాసనాలు రూపొందించి, ఒక న్యాయ సమాజాన్ని ఏర్పాటు చేసింది భారత రాజ్యాంగం! అసలు కేసుకు ఏమాత్రం సంబంధం లేని ‘దార్నబోయే దానయ్య’ను తీసుకొచ్చి, చట్టం ముందు జగన్‌కి అవినీతి కేసు ఆరోపిస్తూ అరెస్టు చేసింది. ఆ సమయంలో ‘అసలు జగన్‌కి అవినీతికి పాల్పడే అధికారం లేద’నే విషయాన్ని కూడా గమనించకుండా, సీబీఐ తరపున బెయిలివ్వకుండా తీర్పులివ్వడం దారుణం. 

ఈ సమయంలో ‘సామాజిక ఉద్యమం’ ఒక్కటే వైఎస్సార్సీపీకి మార్గంగా తోస్తోంది. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఒక అనామకుడు కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు. కోట్లాది జనం ఆయన పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాభిమానం జగన్ సొంతం. అలాంటప్పుడు సమాజంలోనే జగన్‌కి అండగా ‘కొండంత ఉద్యమం’ రావాలి. ఈ ఉద్యమంలో మేధావులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు అందరూ భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించటమే సామాజిక బాధ్యత. అసలు ఏ అధికారంలో ఉన్నాడని జగన్‌ని నేరస్తుడిగా చిత్రీకరిస్తారు? ఒకవేళ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కొడుకుగా జగన్ లబ్ధి పొందాడనుకున్నా, క్యాబినెట్ సమిష్టి నిర్ణయం లేనిదే ముఖ్యమంత్రి ఒక్కడూ ఏం చెయ్యలేడు కదా! 

వారందర్నీ వదిలేసి నేరంతో సంబంధం లేని జగన్ వెంట సీబీఐ పడటం ఏమిటి? క్యాబినెట్ సమిష్టి నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం సీబీఐకి ఉంటుందా? కొన్ని సంఘటనలను పరిశీలిస్తుంటే అసలు సీబీఐ నిష్పక్షపాతంగా తన పని తాను చేసుకుపోతోందా? అన్న సందేహం వస్తోంది. ఉదాహరణకి ఒక హత్య కేసు తీసుకుంటే... తండ్రి హత్య చేశాడని కొడుకుని తెచ్చి జైల్లో పెట్టరు కదా. హత్య చేసినవాడు నేరస్తుడవుతాడు. అసలు హత్య చేసినవాడు మరణిస్తే కేసే తీసేస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా వైఎస్సార్ మరణానంతరం ఆయనను దోషిగా చూపుతూ సీబీఐ ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసింది. అసలు నేరంతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని జగన్‌ని నేరస్తుడిగా చూపిస్తోంది సీబీఐ. ఇటువంటి కేసు సభ్య సమాజానికే అవమానం. ఇలాంటి కేసును ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను వంచకులుగా, మోసగాళ్లుగా చూడాలి. ఆ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.

వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం!


కుటుంబ కలహాలతో నేను నా బిడ్డలకి దూరంగా ఉంటున్నాను. ఒంటరిగా ఉంటున్న బాధ మాటల్లో చెప్పలేనిది. కాని, మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా అందరి మనసుల్లో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇన్ని లక్షల మందికి శాశ్వతంగా దూరమైననాడు, ఇంతమంది జనం ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆ తరుణంలో ఆయన కొడుకుని మన మధ్య వదిలివెళ్లాడు. కాని స్వార్ధ రాజకీయాలతో ఆయన్ని ప్రజల చెంత లేకుండా జైలుపాలు చేశారు మన రాజకీయ నాయకులు. కాని ఒక్కటి మాత్రం నిజం. వారు కష్టపెట్టేది ఒక్క జగన్ కుటుంబాన్నే కాదు, ప్రజలందరినీ. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 

ఎవరెన్ని చేసినా ప్రజల గుండెల్లో ఉన్నవాడే రాజకీయ నాయకుడు. అటువంటి నాయకులు మన వైఎస్సార్ అని ప్రజలు మనస్ఫూర్తిగా చెపుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రజలు మౌనంగా ఎందుకున్నారంటే, చరిత్రలో ఇటువంటి నీచానికి ఒడిగట్టిన స్వార్ధ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికి ఎదురుచూస్తున్నారని అర్థం. జగన్ మన మధ్యకు వస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రజల కోరిక తీరాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నాను.

- రావూరు రమేష్, మహిమలూరు, నెల్లూరు

నాడు నిద్రపోయి.. నేడు డ్రామాలా?

కర్ణాటక.. ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల ఎత్తు పెంచుతున్నప్పుడు ఏం చేశారు
రాష్ట్రానికి నీళ్లు రాకపోతే చరిత్రహీనుడిగా మిగులుతావని
వైఎస్ చెప్పినా కూడా వినిపించుకోలేదు.. పైగా వ్యవసాయం దండగన్నారు
మీ హయాంలో సాగర్ రైతులు వ్యవసాయాన్నే వదిలేశారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 69, కిలోమీటర్లు: 991.2

 ‘‘చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆలమట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాంల ఎత్తు పెంచుకుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే మన రాష్టానికి నీళ్లు రాక పంట పొలాలు బీడు భూములుగా మారతాయని, అదే జరిగితే నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు అని వైఎస్సార్ ఎంత చెప్పినా ఆనాడు చంద్రబాబు నాయుడు వినిపించుకోలేదు. వ్యవసాయం దండగ... ప్రాజెక్టులు నష్టం అన్నాడు. కృష్ణా నీళ్లు మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణం చంద్రబాబు గారు. ఇప్పుడేమో కృష్ణా జలాల కోసం ధర్నా చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడు...’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్రాలు మన రాష్ట్ర నీటి ప్రయోజనాలకు గండి కొడుతుంటే ఆనాడు అధికారంలో ఉంటూ నిద్రపోయారా అని చంద్రబాబును నిలదీశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గ కేంద్రంలో భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఆ పాపం నీది కాదా..?: చంద్రబాబు ఆడుతున్న పాదయాత్ర నాటకంలో వైఎస్సార్‌ను ఒక మాట అన్నారు. కృష్ణా జలాలు మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణం వైఎస్సార్ అట. చంద్రబాబు గారూ.. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా.. మీరు సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంల ఎత్తు పెంచి కట్టుకుంటుంటే నిద్రపోయారు. మీరు నిద్రపోతుంటే కర్ణాటక ప్రభుత్వం రెండు డ్యాంల నిర్మాణాలను పూర్తి చేసింది. అంతేకాదు మహారాష్ర్ట ప్రభుత్వం కూడా కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టుకుంది. అందుకే ఈరోజు మనకు కృష్ణా నీళ్లు తక్కువై పోయాయి. ఈ పాపం నీది కాదా? కింగ్ మేకర్‌ను అని, ఢిల్లీలో తానే చక్రం తిప్పుతున్నానని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటారు. మరి ఆలమట్టి నిర్మాణం ఎందుకు ఆపలేదు బాబూ.. అని అడుగుతున్నా.

మీ హయాంలో సాగర్ రైతులు సాగునే వదిలేశారు..

నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద 40 ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. దీని కింద 80 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఆ ప్రాంత రైతులంతా కలిసి వెళ్లి తాము విద్యుత్తు మోటార్లు కొనుక్కునేందుకు సాయం చేయాలని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా..! మోటార్లు మీరే కొనుక్కోండి అన్నాడు. ఆ పెద్ద మోటార్లకు అయ్యే ఖర్చులు భరించ లేక, అప్పుడు ఉన్న కరెంటు చార్జీలు కట్టలేక రైతులు సాగు చేయడమే మానేశారు. అంతటి ఘనుడు చంద్రబాబు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత వ్యవసాయానికి సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి పెద్ద మోటార్ల కోసం కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల విలువైన విద్యుత్ లైను వేశారు. అంతేకాదు మోటార్లు నడవడానికి 7 గంటలు సరిపోదని 16 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన నేత వైఎస్సార్. అదీ వైఎస్సార్ పెద్ద మనసు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిద్ర లేచి సాగర్ జలాల కోసం ధర్నా చేస్తా అంటున్నాడు.

మోసగాళ్లు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు: వైఎస్సార్‌ను చంద్రబాబు ఇంకో మాట కూడా అన్నారు. రాజశేఖరరెడ్డి గారు రైతులను చాలా మోసం చేశారట! వైఎస్ రైతులను ఎలా మోసం చేశారని చంద్రబాబును అడుగుతున్నా. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి మోసం చేశాడా? రుణాలు మాఫీ చేసి మోసం చేశాడా? రైతు పక్షాన నిలబడి వారికి మద్దతు ధర కల్పించి మోసం చేశాడా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు, రైతులకు పావలా వడ్డీకే రుణాలిచ్చి మోసం చేశాడా? పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించి మోసం చేశాడా? చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆయన హయాంలో హింస తట్టుకోలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు గారూ.. మోసం చేయడంలో తమరిని మించిన వాళ్లు లేరు. సొంత మామను వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌ను మోసం చేసి కుర్చీ లాక్కుంది మీరు కాదా? మోసగాళ్లు ఎవరో.. మంచి వాళ్లు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు.

సహకార రంగాన్ని ముక్కలు చేశావు: సహకార పరిశ్రమలను చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరులకు పప్పు బెల్లాల మాదిరి అమ్మేసుకున్నారు. నిజాం షుగర్స్ ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కాదు దేశంలోనే పేరున్న పరిశ్రమ. దానికి అప్పటి నిజాం ప్రభుత్వం 16 వేల ఎకరాల భూమి ఇచ్చిందట. తెలంగాణ రైతన్నలకు, కార్మికులకు అన్నం పెట్టిన ఆ పరిశ్రమను చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే ముక్కలు ముక్కలుగా చేసి తనకు అయినవారికి ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచిన పాలేరు చక్కెర పరిశ్రమను ఆయన పార్టీకే చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు కారు చౌకగా కట్టబెట్టారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన పరిశ్రమను వాటాదారులైన రైతులకు కూడా తెలియనివ్వకుండా కేవలం రూ.9.50 కోట్లకే అప్పగించారు. ఈ పరిశ్రమ అమ్మే నాటికి 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలు ఉన్నాయి. దీని విలువే సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. అలాగే రూ.35 కోట్ల విలువ చేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును వారి పార్టీకి చెందిన సీఎం రమేష్‌కు కేవలం రూ.12 కోట్లకు కట్టబెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ధారాదత్తం చేశారు. మిర్యాలగూడలోని అవంతిపురంలో ఉన్న నిజాం షుగర్స్‌ను బాబు మనసు లేకుండా మూసేశారు.

సర్కారు మేలు చంద్రబాబుకే: ఈ సర్కారు కాంగ్రెస్ వాళ్లకు తప్ప ఇంకా ఎవరికీ మేలు చేయడం లేదు. వాళ్లకు కాకుండా ఇంకా ఎవరికైనా మేలు చేస్తుందా అంటే.. అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! మొన్న జరిగిన ఎఫ్‌ఐడీ బిల్లులో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, సహకార ఎన్నికల్లో ఇద్దరు కలిసే పోటీ చేస్తారు. వీళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటై సీబీఐని వాడుకొని జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి జైలుకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం తనకు ఎదురు తిరిగిన వారిపై సీబీఐని ఆయుధంగా వాడుతోంది. సీబీఐ కీలుబొమ్మ కాబట్టే చిరంజీవి గారి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు దొరికినా పట్టించుకోరు. బొత్స సత్యనారాయణను మించిన మాఫియా డాన్ మరొకరు లేరని సొంత పార్టీ వాళ్లే ఆరోపించినా విచారణ జరపరు.

ఆయనకు అవసరమైనప్పుడే అవిశ్వాసం: చంద్రబాబుకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నాడు. ఇప్పుడు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని కొత్త నాటకం ఆడుతున్నాడు. ప్రజలకు కాదు.. ఆయనకు అవసరం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతారట. తమ ఎమ్మెల్యేల బలం సరిచూసుకొని, చంద్రబాబూ.. ఇక ఇప్పుడు అవిశ్వాసం నాటకమాడు అని ప్రభుత్వం పచ్చజెండా ఊపితే అప్పుడు అవిశ్వాసం పెడతారు.

ఆదివారం 69వరోజు పాదయాత్ర మిర్యాలగూడ రూరల్ మండలం శ్రీనివాసనగర్ నుంచి ప్రారంభమైంది. వెంకటాద్రిపురం మీదుగా మిర్యాలగూడలోకి ప్రవేశించింది. ఎఫ్‌సీఐ కాలనీ, బైపాస్ రింగ్‌రోడ్డు, హనుమాన్‌పేట, బస్టాండు మార్కెట్ మీదుగా రాజీవ్ చౌక్‌కు చేరింది. అబద్ధపు కేసులతో జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో జనం నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాదయాత్రలో పాల్గొన్నారు. రాజీవ్‌చౌక్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం మీదుగా ఎదులగూడెంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 12.6 కి.మీ ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 991.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, జిల్లా మహిళా కన్వీనర్ సూరపల్లి సత్యకుమారి, స్థానిక నాయకులు శ్రీకళారెడ్డి, స్పురధర్‌రెడ్డి, మహేష్ ఆదిభట్ల, కుంభం శ్రీనివాసరెడ్డి, అల్కా శ్రావణ్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Saturday, February 16, 2013

హోం > మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమాన పాదయాత్రికులు


వారంతా వైఎస్ పాలనతో స్ఫూర్తి పొందినవారు. ఆయన ఆశయాల సాధనకు తోడుగా నిలవాలనుకున్నారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆయన కూతురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రలో మేమున్నామంటూ పాలుపంచుకుంటున్నారు. పాదయాత్ర మొదటి అడుగు నుంచి నిరంతరంగా పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ దవళ గిరిబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడానికి ముందుకొచ్చిన వా రంతా కలిసి పాదయాత్రికుల సంఘంగా ఏర్పడ్డారు.

68రోజులుగా ఇప్పటివరకూ 973 కిలోమీటర్ల దూరం నడిశారు. వీరిలో ఒక వికలాంగుడు ఉండటం విశేషం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్సార్ సంక్షేమ పథకాలు కొనసాగాలి, తద్వారా పేదలందరికీ మంచి జరగాలని వారు ఆశిస్తున్నారు. వారి ఆశ.. జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల ఆశయాలు.. త్వరలో నెరవేరాలని ఆశిద్దాం. పాదయాత్ర చేస్తున్న వారిలో పాదయాత్రికుల సంఘం అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ దవళ గిరిబాబు, సన్నపురెడ్డి రమణమ్మ, ఎం ప్రమీల, దయామణి, వెంకట రమణ, కంది అంజి రెడ్డి, బోళ్ల లింగయ్య, వీరాచారి, కె.నర్సింహ, లక్ష్మీరెడ్డి, ఎస్ రమణమ్మ, లక్ష్మీ నారాయణలు ఉన్నారు.

ఈ సర్కారుపై బాబుకే భరోసా

టీడీపీ అధినేతకు తప్ప ప్రజలెవరికీ ఈ ప్రభుత్వంపై భరోసా లేదు
ఇది అసమర్థ ప్రభుత్వం అని తిడుతూనే అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతున్నారు
అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు
ప్రజాభిమానమే జగనన్నకు అండ.. వర్షంలోనే తడుస్తూ షర్మిల కోసం ఎదురు చూసిన జనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 68, కిలోమీటర్లు: 978.6


‘‘వైఎస్సార్ సిసలైన వారసుడిగా జగనన్నను ప్రజలు స్వాగతించారు.. అందుకే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుట్రలు చేసి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నాలుగు గోడల మధ్య బంధించారు. మీ ప్రేమాభిమానాల వల్లే జగనన్న జైల్లో కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ మీద ప్రజలెవరికీ భరోసా లేదు. ఎవరికైనా భరోసా ఉందీ అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే..’’ అని ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ఓవైపు ఇది అసమర్థ ప్రభుత్వం.. చేతగాని ప్రభుత్వం.. అని చంద్రబాబు తిడుతూనే మరోవైపు అవిశ్వాసం పెట్టకుండా సర్కారును కాపాడుతున్నారని విమర్శించారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని మ్యానేజ్ చేసుకుంటారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం 68వ రోజు నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సాగింది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో పాదయాత్ర టెంట్లు కూలిపోయాయి. షర్మిల కోసం ఏర్పాటు చేసిన టెంటు వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. టెంటు చుట్టూ నీళ్లు చేరాయి. షెడ్యూల్ ప్రకారం ఆమె పాదయాత్రకు సిద్ధమైనప్పటికీ వాతావరణం అనుకూలించ లేదు. మరోసారి వర్షం కురవడంతో పాదయాత్ర బస్సు మట్టిలో కూరుకుపోయింది. 

మధ్యాహ్నం 12.30 గంటలకు వర్షం తెరిపినివ్వడంతో షర్మిల ముకుందాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్రిపురారం గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తుంగపాడు చేరుకొని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి ప్రసంగించారు. ఇంతటి వర్షంలోనూ తనతోపాటు కలిసి నడిచేందుకు వచ్చినవారందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, మీ అభిమానమే జగనన్నకు అండ అని అన్నారు. తుంగపాడు నుంచి తిరిగి నడక మొదలుపెట్టిన కాసేపటికే మళ్లీ ఆకాశం మేఘావృతమైంది. దీంతో పార్టీ నేతలు పాదయాత్రను కుదించుకోవాలని షర్మిలకు సూచించారు. దీంతో శ్రీనివాసనగర్‌లోని ఓ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 6.2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 978.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బాలమణెమ్మ, బండారు మోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు శ్రీకళారెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ సూరపల్లి సత్యకుమారి, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్‌కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, బోయపల్లి అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రపై కలెక్టర్‌తో చర్చ

 వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుండటంతో జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌తో ఆ పార్టీ నాయకులు చర్చించారు. శనివారం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కావటి మనోహరనాయుడు, బండారు సురేష్ తదితరులు కలెక్టర్‌ను కలిశారు. షర్మిల పాదయాత్ర వివరాలు వెల్లడించారు. 

షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న షర్మిల గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారని, 13 నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో షర్మిల జిల్లాలో ఉండకూడదని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు అమల్లో ఉంటుందని వివరించారు. షర్మిల 18న జిల్లాలో ప్రవేశించినా.. ఆ మర్నాడే జిల్లాను వదిలి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాదయాత్ర ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచించారు. దీంతో మరోసారి సమావేశమై పాదయాత్ర షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు.


నిన్ను చూసి పోదామని ఎదురుచూస్తున్న బిడ్డా..

‘‘అమ్మా.. వర్షం అదను మీద పడలేదు.. బత్తాయి పూత, పిందె మీద వానపడుతోంది. మూడెకరాలుంటే బత్తాయి పెట్టిన.. ఈ వానకు పూత రాలింది.. తోటకు పోయి సూద్దామనుకున్నా.. చెప్పులేసుకొని బయటికెళ్లిన. కానీ షర్మిలమ్మ టెంటు కూలిందని ఊళ్లోళ్లు చెప్పుకుంటుంటే తోటకు పోబుద్ది కాలేదు బిడ్డా.. పాణం గుంజింది. నిన్నుజూసి పోదామని ఎదురుచూస్తున్న..’’ అని తుంగపాడుకు చెందిన రైతు మచ్చ పోషన్న షర్మిలతో అన్నారు. శనివారం హోరున వర్షం కురిసినా షర్మిల కోసం పెద్ద ఎత్తున జనం ఎదురుచూశారు.

Sharmila and others in nagarjunasagar paadayatra

 
























సూర్యుడు ఉండాల్సింది మబ్బుల చాటున కాదు!


కొమ్మపై కూర్చున్న పక్షి పెనుగాలికి కొమ్మ ఊగినా, విరిగినా భయపడదు. ఎందుకంటే ఆ పక్షికి కొమ్మలు, చెట్టురెమ్మల కంటే తన రెక్కల పైనే విశ్వాసం. అలాగే మా జగనన్నకు తన మీద తనకు నమ్మకం ఉంది. మాకూ ఆయన మీద నమ్మకం ఉంది. కల్లాకపటం తెలియని నవ్వుతో నిష్కల్మషంగా ఉండే మా జగనన్న అనునిత్యం ప్రజల గుండెల్లో చోటుకోసం మాత్రమే తపిస్తుంటారు. ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రజాసమస్యలపై పోరాడేతత్వం, ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం జగనన్నలో ఉన్నాయి. లీడర్ అంటే ఇలాగే ఉండాలని ఆనాడు మహానేత వైయస్సార్ గారిని చూసి అనుకున్నాం. ఈరోజు అలా జగనన్నని చూస్తున్నాం. తండ్రి వారసత్వాన్నే కాక ఆయన ఆశయాలనూ వారసత్వంగా స్వీకరించిన పులిబిడ్డ మా జగనన్న. అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని వైయస్సార్ ఆనాడు తన పాదయాత్రతో తిరిగితెస్తే... ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రతో అధికారాన్ని, పదవినీ త్యాగం చేసిన యువనేత జగన్.

పార్టీలు, పదవులు శాశ్వతం కాదని నమ్మి, ప్రజల కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చారు. అలాగే నాయకుడనేవాడు ఎన్నేళ్లు పరిపాలించామని కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలించాలని వైఎస్సార్ అనేవారు. ఆ మాటనే జగన్ నేడు ఆచరిస్తున్నారు. వైఎస్సార్ మరణంతో మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనీ, ఆ లోటును జగనన్న తప్ప మరెవరూ భర్తీ చేయలేరనీ గుర్తించి, ఆ నిజాన్ని భరించలేకపోయిన ప్రభుత్వం, ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలకు తొత్తులుగా మారిన ఎల్లో మీడియా కలిసి నీచ రాజకీయాలతో కుమ్మక్కయి, కుట్రపన్ని మహానేత కుటుంబంలో ఆడపడుచులను సైతం రోడ్డుపైకి వచ్చేటట్లు చేశారు. 

పదవుల కోసం, అధికారం కోసం ఆనాడు వైఎస్సార్‌తో ఉన్న వాళ్లంతా ఇప్పుడు జగన్‌కు దూరం అయ్యారు. అయితేనేం, ఆనాడు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు మాత్రం నేటికీ పెద్దాయన కుటుంబంతోనే ఉన్నారు. జగనన్నపై ఆదరణ కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కుటిలకూటములు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వై.ఎస్. కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడ్డానికి సిద్ధం కావాలి. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఉండవలసింది మబ్బులచాటున గాదు, ప్రజల మధ్యలో. ఆ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. నా కుటుంబమే నా ప్రపంచం అనుకోకుండా ఈ ప్రపంచమే నా కుటుంబం అని ముందుకు సాగుతున్న వై.ఎస్. కుటుంబానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 

- ఎ.కృపావతి, కపాడిపాలెం, నెల్లూరు

జగనన్నను చూడాలని ఉంది...


ఆంధ్రుల ప్రియతమ నాయకుడు, కడప ఎం.పి, వైయస్సార్ ిసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ‘ఆస్తులు సంపాదించుకున్నారు’ అనే నింద మోపి సీబీఐ విచారణ పేరిట ఈ ప్రభుత్వం జగనన్నను జైలుపాలు చేసి రాష్ట్రప్రజలను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసింది. విచారణ కొనసాగింపు పేరుతో ఎనిమిది నెలలు దాటినా విడుదల చేయలేదు. ఆంధ్రప్రజలు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించిన జగన్‌ని ఇన్నిరోజుల పాటు కళ్లకి కనపడకుండా, జైలు గోడల మధ్య ఉంచడం ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. జగన్ త్వరలోనే బయటికి రావాలని, గాడి తప్పి పక్కదోవ పడుతున్న రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది, సక్రమ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాను.

- నాగ బ్రహ్మం, ఒంగోలు

బతుకంతా చీకటి.... నీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఫీజులు కట్టట్లేదు..

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన
పెరిగిన ధరలతో బతుకు భారంగా మారిందని కన్నీళ్లు..
వైఎస్సార్ పోయాక తమను పట్టించుకున్న వాళ్లే లేరని మండిపాటు
రోజుకు రెండు గంటలే కరెంటా? ఇదెక్కడి న్యాయం?: షర్మిల
చంద్రబాబు గారూ.. ప్రజల గోడు మీకు వినిపిస్తోందా?
ఇప్పటికైనా ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 67, కిలోమీటర్లు: 972.4

ఆఖరి వాన కురిసి ఐదు నెలలు దాటింది.. పంటల సంగతి దేవుడెరుగు.. ఊళ్లలో మనుషులు తాగడానికి.. అడవి మీద పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు.. రోజుకు రెండు గంటలకు మించి కరెంటు రాదు. మోటారు నుంచి నీళ్లు దునికి మడికి పారకముందే మళ్లీ కరెంటు పోతది.. పొద్దంతా కష్టం చేసి ఇంటికి పోయి పడుకుందామంటే దోమల మోత.. వైఎస్సార్ పోయిన తరువాత మా బతుకంతా చీకట్లే’’ అని ముకుందాపురం గ్రామానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘మా మహిళా సంఘం తరఫున బ్యాంకు నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాం. మూడేళ్ల నుంచి అప్పు కడుతున్నాం. ఇంకా రూ.1.66 లక్షల అప్పుంది. నెల నెలా వడ్డీ కట్టించుకుంటున్నారు. పావలా వడ్డీ అని చెప్తున్నారు కానీ రూ.3 వడ్డీ దాకా లెక్కొస్తోంది..’’ ముకుందాపురం గ్రామానికే చెందిన నాగమణి గోడు వెళ్లబోసుకుంది.

‘‘అక్కా పరీక్షలు దగ్గర పడ్డాయి. చదువుకుందామంటే రాత్రి కరెంటు ఉండటం లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు ఇంత వరకు రాలేదు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్తోంది. అమ్మ వాళ్లను ఫీజు అడిగితే.. చూస్తున్నావుగా బిడ్డా పంట చేతికి రాలేదు. ఫీజు ఎట్టా కట్టాలే అంటున్నారు. భయం వేస్తోందక్కా..’’ అని నిడమనూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చంద్రకళ కళ్లనీళ్లు పెట్టుకుంది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండల్లో రాములమ్మ, నాగమణి, చంద్రకళ ఇలా తమ గోడు చెప్పుకొన్నారు. వీరే కాదు.. పాదయాత్రలో రోజూ ఏ పల్లెకు వెళ్లి పలకరించినా ఇవే కష్టాలు! ఎవరిని కదిలించినా.. ఇవే కన్నీళ్లు. ఏ రైతు ముఖం మీదా చిరునవ్వు లేదు. ఏ మహిళ నోటి నుంచీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న మాట లేదు. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో జరిగిన రచ్చబండల్లోనూ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరిగిన ధరలతో తమకు బతుకే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు విన్న షర్మిల.. జనాన్ని గాలికొదిలేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండి పడ్డారు. రోజుకు రెండు గంటలే కరెంటు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబూ మీకు వినిపిస్తోందా?

‘‘చంద్రబాబు గారూ.. వీళ్ల మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రజల కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? ఇక ఆపండి.. పాదయాత్రల పేరుతో మీరు చేస్తున్న డ్రామాలు ఆపండి. మీరు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని అంటున్నారు. ఈ ప్రజల అవసరాలు మీకు కనిపించడం లేదా? మీకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అందుకే అవిశ్వాసం పెట్టకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటేసేముందు గుర్తుంచుకోవాలంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. మీరు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీపై కేసులు పెట్టదు.. విచారణ జరపదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

ఇది బాబు పాలనే..

రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి వేస్తే రైతన్న కష్టం పోనూ క్వింటాల్‌కు రూ. 5 వేల ఖర్చు వస్తోంది. కానీ మార్కెట్‌లో పత్తి మద్దతు ధర రూ. 3,900కు మించలేదు. తరుగు, దళారుల మోసం తీసేస్తే రైతన్న చేతికి వస్తుంది కేవలం రూ. 2,500లే. అప్పుల బాధలు పడలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క పత్తి రైతులే కాదు.. టమాటా, మిర్చి.. వరి సాగు చేసే ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతున్నారు. రైతులు పంటలు చేతికి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారు. ఆదుకునే నాథుడు లేకఅల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచారు. రైతు మద్దతు ధరనేమో దించారు. ఇవే కష్టాలు, కన్నీళ్లను చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చూశాం.. ఆయన హయాంలో దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలనను తలపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం.’’

వైఎస్ హయాంలో రూ.12 వేల కోట్ల రుణమాఫీ..

ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకు పోతున్నారు. అమ్మా ఇదెక్కడి అన్యాయం అంటున్నారు రైతులు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్ల విద్యుత్తు బకాయిలను రద్దు చేశారు. 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని మాటిచ్చి.. ఇచ్చి చూపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉంటే ఈ రోజు విద్యుత్తు చార్జీలు పెరిగేవే కాదు. వైఎస్ విత్తనాల ధరలను దించారు.. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించారు. వైఎస్సార్ రైతులను గౌరవించారు.. ప్రేమించారు.. అందుకే రైతన్నలు బాగుపడాలని రూ. 12 వేల కోట్ల రుణాలనుమాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న ఆ సర్కారుకు పెద్దమనసు లేదు. మహిళలైతే తమ పిల్లలను స్కూల్‌కు పంపించకుండా తమ వెంట పనులకు తీసుకొని పోతున్నారు. ఎందుకక్కా అని అడిగితే ‘కూలికి తీసుకొని పోతే కూలి డబ్బులు వస్తాయి కదమ్మా.. కనీసం రెండు పూటలైనా తింటాం’ అని చెప్తున్నారు. ‘ఒక రోజంతా కూలి చేస్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి. నెల రోజులు కష్టం చేస్తే 3,000 రూపాయలు వస్తాయి.. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ డబ్బులు ఎలా సరిపోతాయమ్మా.. మేం ఎలా బతకాలమ్మా’ అని అంటున్నారు.

విద్యార్థులు చదువులు నిలిపేస్తున్నారు..

పేదోళ్లు పెద్ద చదువులు చదవాలని, ప్రతి ఇంటి నుంచి డాక్టరో.. ఇంజనీరో.. కలెక్టర్ లాంటి పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయన ఉన్నంత కాలం విద్యార్థుల ఫీజులను ఆయనే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఏం చేశారు? విద్యార్థి ఫీజులో రెండు వాటాలు తల్లిదండ్రులు భరిస్తే... ఒక వాటా మేం ఇస్తామని విద్యార్థులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే నిలిపేస్తున్నారు.’’

‘మరో ప్రజాప్రస్థానం’ 67వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా అలీనగర్ గ్రామ శివారు నుంచి షర్మిల యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్, నిడమనూరు, నర్సింహుల గూడెం, బీకే తాండా, బొక్కముంతలపాడు గ్రామాల మీదుగా ముకుందాపురం చేరుకున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 972.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గట్టు శ్రీకాంత్, బాలమణెమ్మ, స్థానిక నాయకులు బండారు మోహన్‌రెడ్డి, గాదె నిరంజన్, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్ కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, సూరపల్లి సత్యకుమారి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

Thursday, February 14, 2013

అభయమిచ్చే మనిషివి నువ్వన్నా... అంతిమ విజయం నీదేనన్నా..!

జగనన్నా!
నువ్వెంత ఎదిగినా అంత ఒద్దికగా ఉంటావు.
సిరిసంపదలు నీకెన్ని వున్నా...
నిరుపేదలకెప్పుడూ ఆపద్బాంధవుడివై ఉంటావు.
ఇచ్చిన మాటపై నిలిచావు.
కొండంత ఓదార్పు నిచ్చావు.
జనంకోసం దీక్షలు చేశావు.
రైతన్న కోసం నిరసనలు చేశావు.
అందుకేగా ఈ కాంగ్రెస్ నిన్ను...
జనానికి దూరం చేసింది!
ప్రజాప్రతినిధివైన నిన్ను జైల్లో నిర్బంధించింది!
ఇంతకాలం గడచినా ఇంకా రిమాండులోనే ఉంచింది!
ప్రజాస్వామ్యం మనదని మరచిపోయిందేమో! 
జగనన్నా!
అభయమిచ్చే మనిషివి నువ్వన్నా.
ఎవరి భయం నీకు లేనేలేదన్నా.
త్వరలోనే విడుదలౌతావు. జనం మధ్యకు వస్తావు.
ప్రజాకోర్టులో విజయం పొందుతావు
జననేతవై సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తావు.
- దుర్గం ఉమ, తిరుపతి
Related Posts Plugin for WordPress, Blogger...