Sunday, February 10, 2013

జగన్‌పై దుష్ర్పచారాన్ని జనమెవ్వరూ నమ్మరు


ప్రపంచంలో ఏ సోషలిస్ట్ దేశంలోనూ లేని అనేక ప్రజాహిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగుజాతి హృదయాలలో దేవుడిగా కొలువుదీరిన దివంగత నేత వైఎస్సార్.... ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో రాష్ట్రం రామరాజ్యంలా వెలుగొందింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితిలో, నియంత చంద్రబాబు పాలనలో ప్రజలు విలవిలలాడుతున్న నేపథ్యంలో తెలుగుజాతికి అండగా నిలిచి ప్రత్యామ్నాయం అందిస్తానని వై.ఎస్. చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను రద్దుచేసి, రైతుబాంధవుడిగా వై.ఎస్. అహర్నిశలూ శ్రమించారు. 

అన్నదాతకు శాశ్వతంగా సాగునీరు అందించాలన్న ఆలోచనతో జలయజ్ఞం చేపట్టి అపర భగీరథుడిగా ఖ్యాతిగాంచారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి, విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దటానికి అనేక పవర్ ప్రాజెక్టులకు వై.ఎస్. రూపకల్పన చేశారు. కానీ ఆయన మృతితో రాష్ట్రమే అంధకారంలో పడింది. వై.ఎస్. సంక్షేమ పథకాలకు సైతం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తిలోదకాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో వై.ఎస్. ఆశయాలను నిజం చేయటానికి ముందుకు వచ్చిన జగన్‌ను నియంత్రించటానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఏకమై దుష్ర్పచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ప్రజలంతా తిప్పికొట్టి, జగన్‌కు పట్టం కట్టే రోజు ఎంతో దూరంలో లేదు.

- వజ్జ బాబూరావు, పలాస 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...