వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల తిరిగి 'మరో ప్రజాప్రస్థానం' కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. షర్మిలకు కాలి గాయం కావడంతో మధ్యలోనే నిలిపివేసిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను బుధవారం ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా తుర్క యంజాల్ నుంచి చేపట్టనున్నారు. ఆ రోజు సాయంత్రం 5గంటలకు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘరాం తెలిపారు.
|
No comments:
Post a Comment