జగన్గారిపై పెట్టిన అక్రమ కేసులు, వాటి స్వభావం, పక్షపాతం, పర్యవసానం అధికార ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓటర్లకు సైతం కొంతమేరకు తెలియవచ్చినదిగా జూన్నాటి ఉప ఎన్నికలు తేటతెల్లం చేశాయి. పై కేసులు పెట్టుబడులకు సంబంధించినవి. పెట్టుబడులు వేరు, లంచాలు వేరు. లంచాలపై లాభాలు తిరిగిరావు కాని, పెట్టుబడులపై లాభాలు తిరిగి తీసుకోవచ్చు. అయితే చర్చాకార్యక్రమాల్లో ప్రతినిధులు ఈ వాదనను వినిపించుట లేదు. జగన్గారి బెయిల్ విషయంలో 1. క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం భూములు కేటాయించినట్లు అప్పటి సమాచార మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రిగారి పత్రికా సమావేశ వివరాలు పత్రికల్లో, టీవీ చానెళ్లలో రికార్డయి ఉన్నాయి. కోర్టులో వాటిని సాక్ష్యాలుగా చూపి జగన్ తప్పులేదని, అవి క్యాబినెట్ నిర్ణయాలు తప్ప జగన్వి కావని వాదించాలి. 2. జగన్గారి అకౌంట్స్, టాక్స్ రిటర్న్స్ ప్రతి యేడూ పరిశీలిస్తున్నవే. ఏమైనా తప్పులు జరిగి ఉంటే అప్పుడే నోటీసులు ఇచ్చి విచారించేవారు. సీబీఐవారికి అనుమానాలుంటే ఇన్కమ్టాక్స్వారిని విచారించాలి. అలా కాకుండా విచారణ కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వొద్దు, జగన్ జైల్లోనే ఉండాలని కోరటం సమంజసం కాదు. 3. చంద్రబాబుకి సంబంధించిన కేసులో తగినంత సిబ్బంది లేని కారణంగా విచారణ చేయని సీబీఐ వారికి ప్రస్తుతం అదే సిబ్బందితో జగన్ కేసు విచారణ జరిపిస్తే ఉద్దేశపూర్వక జాప్యం జరగదని గ్యారెంటీ ఏమిటి? సీబీఐవారు తమ అవసరం, అనుకూలతల కోసం జగన్గారికి ఎక్కువకాలం బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది. అలా అడ్డుకోవటం సమ్మతం కాదనే వాదనను కోర్టులో బలంగా వినిపించాలి. సీబీఐవారి అనుకూలత ఇతరులకు శాపం కాకూడదు. ఈ మూడు విషయాలను గౌరవనీయులైన న్యాయమూర్తులు గమనించాలని న్యాయాన్ని కోరుకునే ఒక పౌరుడిగా నేను కోరుతున్నాను.
- ఎం.వేణుగోపాలరావు, కర్నూలు
No comments:
Post a Comment