Sunday, February 10, 2013

ఎవరెన్ని అవరోధాలు కల్పించినా...చివరికి ప్రజల అభీష్టమే నెరవేరుతుంది!


ఈ రోజున వైఎస్సార్‌గారి కుటుంబంపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ఏ రోజూ కూడా చంద్రబాబుపై విచారణ జరిపించనివారు కేవలం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే, కనీస విచారణైనా లేకుండా ఆయన్ని అరెస్టు చేశారని మేం భావిస్తున్నాం. దివంగత నేత వైఎస్సార్ ఉండగా మాట్లాడటానికి భయపడిన నాయకులు, ఈరోజు ఆయనపై, ఆయన తనయుడిపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌పై ప్రజల్లో ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవాన్ని దెబ్బతీయడానికే ఆ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం యావత్తూ జగన్‌నే సీఎంగా చూడాలని కోరుకుంటోంది. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా జగనే ఈ రాష్ట్ర నాయకుడౌతారు. 

- ఎం.డి.లయిఖ్ అహ్మద్ (అక్తర్), భువనగిరి, నల్లగొండ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...