ఆంధ్రుల ప్రియతమ నాయకుడు, కడప ఎం.పి, వైయస్సార్ ిసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ‘ఆస్తులు సంపాదించుకున్నారు’ అనే నింద మోపి సీబీఐ విచారణ పేరిట ఈ ప్రభుత్వం జగనన్నను జైలుపాలు చేసి రాష్ట్రప్రజలను ఎంతో బాధకు, ఆవేదనకు గురి చేసింది. విచారణ కొనసాగింపు పేరుతో ఎనిమిది నెలలు దాటినా విడుదల చేయలేదు. ఆంధ్రప్రజలు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించిన జగన్ని ఇన్నిరోజుల పాటు కళ్లకి కనపడకుండా, జైలు గోడల మధ్య ఉంచడం ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను. జగన్ త్వరలోనే బయటికి రావాలని, గాడి తప్పి పక్కదోవ పడుతున్న రాష్ట్ర రాజకీయాలను చక్కదిద్ది, సక్రమ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాను.
- నాగ బ్రహ్మం, ఒంగోలు
No comments:
Post a Comment