Sunday, February 10, 2013

వై.ఎస్. అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది

జీవితమంతా ప్రజలతోనే మమేకమై, ప్రజల కోసమే జీవించి, ఆ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహానాయకుడు వైఎస్సార్. అటువంటి నాయకుడిని బతికున్నప్పుడు పొగిడిన నాయకులు అయితేనేమి, కాంగ్రెస్ అధిష్టానమైతేనేమి, చనిపోయిన తర్వాత విమర్శలు చేస్తూ చివరకు చార్జ్‌షీట్‌లో కూడా పేరు చేర్చి, వారి కుటుంబాన్ని, రాష్ట్రంలోని వై.ఎస్. అభిమానులను వేదనకు గురిచేస్తున్నారు. వీటన్నిటికీ త్వరలో ప్రజలే జవాబు చెబుతారు. తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకుని, ఇంత చిన్న వయసులో అమితమైన ఓపికతో, ప్రతి క్షణం ప్రజాసంక్షేమం కోసం నాన్న బాటలో నడుస్తూ ఉన్న జగన్‌ని చూసి ప్రజలంతా వైఎస్సార్ తర్వాత అంతటి నాయకుడు ఉన్నాడనుకుంటున్న తరుణంలో ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఆ యువనేతను అరెస్ట్ చేసింది. 

రాత్రీ పగలు లేకుండా ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజల కోసమే పుట్టాడు అని అనిపించే ఒక నాయకుడిని, రాజకీయంగా ఎదుర్కోలేక అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఈ చర్య రాష్ర్ట ప్రజలను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తూ బెయిల్ రాకుండా చేస్తూ, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నా ఎంతో ధైర్యంతో, ఓపికతో చిరునవ్వు చెదరకుండా ఉన్న జగన్‌ని చూస్తే అంత ఆవేదనలోనూ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. మా నాయకుడివి నువ్వేనని ఆశీర్వదిస్తున్నారు. ఆ కుటుంబాన్ని అభిమానించే ప్రజలను ఇంత క్షోభకు గురిచేస్తున్నవారిని ఆ దేవుడు శిక్షించి తీరుతాడు. త్వరలోనే జగనన్నను బయటకు రప్పిస్తాడు.

- కె.మురళీధర్‌రెడ్డి, పులివెందుల

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...