Sunday, February 17, 2013

వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం!


కుటుంబ కలహాలతో నేను నా బిడ్డలకి దూరంగా ఉంటున్నాను. ఒంటరిగా ఉంటున్న బాధ మాటల్లో చెప్పలేనిది. కాని, మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా అందరి మనసుల్లో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇన్ని లక్షల మందికి శాశ్వతంగా దూరమైననాడు, ఇంతమంది జనం ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆ తరుణంలో ఆయన కొడుకుని మన మధ్య వదిలివెళ్లాడు. కాని స్వార్ధ రాజకీయాలతో ఆయన్ని ప్రజల చెంత లేకుండా జైలుపాలు చేశారు మన రాజకీయ నాయకులు. కాని ఒక్కటి మాత్రం నిజం. వారు కష్టపెట్టేది ఒక్క జగన్ కుటుంబాన్నే కాదు, ప్రజలందరినీ. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 

ఎవరెన్ని చేసినా ప్రజల గుండెల్లో ఉన్నవాడే రాజకీయ నాయకుడు. అటువంటి నాయకులు మన వైఎస్సార్ అని ప్రజలు మనస్ఫూర్తిగా చెపుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రజలు మౌనంగా ఎందుకున్నారంటే, చరిత్రలో ఇటువంటి నీచానికి ఒడిగట్టిన స్వార్ధ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికి ఎదురుచూస్తున్నారని అర్థం. జగన్ మన మధ్యకు వస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రజల కోరిక తీరాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నాను.

- రావూరు రమేష్, మహిమలూరు, నెల్లూరు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...