Saturday, February 16, 2013

హోం > మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమాన పాదయాత్రికులు


వారంతా వైఎస్ పాలనతో స్ఫూర్తి పొందినవారు. ఆయన ఆశయాల సాధనకు తోడుగా నిలవాలనుకున్నారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆయన కూతురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రలో మేమున్నామంటూ పాలుపంచుకుంటున్నారు. పాదయాత్ర మొదటి అడుగు నుంచి నిరంతరంగా పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ దవళ గిరిబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడానికి ముందుకొచ్చిన వా రంతా కలిసి పాదయాత్రికుల సంఘంగా ఏర్పడ్డారు.

68రోజులుగా ఇప్పటివరకూ 973 కిలోమీటర్ల దూరం నడిశారు. వీరిలో ఒక వికలాంగుడు ఉండటం విశేషం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్సార్ సంక్షేమ పథకాలు కొనసాగాలి, తద్వారా పేదలందరికీ మంచి జరగాలని వారు ఆశిస్తున్నారు. వారి ఆశ.. జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల ఆశయాలు.. త్వరలో నెరవేరాలని ఆశిద్దాం. పాదయాత్ర చేస్తున్న వారిలో పాదయాత్రికుల సంఘం అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ దవళ గిరిబాబు, సన్నపురెడ్డి రమణమ్మ, ఎం ప్రమీల, దయామణి, వెంకట రమణ, కంది అంజి రెడ్డి, బోళ్ల లింగయ్య, వీరాచారి, కె.నర్సింహ, లక్ష్మీరెడ్డి, ఎస్ రమణమ్మ, లక్ష్మీ నారాయణలు ఉన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...