వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. దేవరకొండ నియోజకవర్గం మాల్ గ్రామంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. షర్మిల వస్తున్నారని తెలిసి అభిమానులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామం జనంతో నిడిపోయింది. గ్రామంలో ఈ సాయంత్రం 6.30 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మాల్ సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. మేడలపైన, మిద్దెలపైన నిలబడి జనం ఆమె ప్రసంగాన్ని విన్నారు. ప్రసంగానికి అపూర్వ స్పందన లభించింది.
No comments:
Post a Comment