ప్రపంచంలో ఏ మహిళా సాహసించని విధంగా మహాపాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని, రాజన్న కూతురుగా, జగనన్న చెల్లెలుగా ముందుకు నడుస్తున్న షర్మిలను చూస్తే అటు వంటి స్ఫూర్తి ఆ కుటుంబానికే సాధ్యం అని అనిపిస్తోంది. జగన్ వదిలిన బాణంగా షర్మిల దూసుకుపోతోంది. ఆమెకు ఆ శక్తి ఎక్కడిది? జగన్ శక్తే ఆమె శక్తి. జగన్ను షర్మిలలో చూసుకుంటున్నారు జనం. తాత్కాలికంగా తమకు దూరమైన ఆ యువనేతను షర్మిలలో చూసుకొని ఊరిడిల్లుతున్నారు. జగన్ విడుదలైన రోజున ఆయనకు స్వాగతం చెప్పడానికి ఈ భూమి చాలదు.
ఇదంతా వైఎస్ దయ. వై.యస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం పార్టీలతో వర్గాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిచింది. వారు సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడింది. అందువలన వై.యస్. చనిపోయి ఇన్నేళ్ళయినా ప్రజలు గుండె అనే గూటిలో గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. రాజన్న మరణం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని, దుఃఖాన్ని మిగిల్చింది. రాజన్న రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అప్పనంగా అనుభవిస్తున్న ఢిల్లీ గల్లీ ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, వారి కుర్చీలు కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలబడి నేనున్నాను అంటూ ముందుకు వచ్చి, ప్రజాసాగరంలో పగలు, రాత్రి, ఎండ, వాన లెక్క చేయకుండా ప్రజలనే కుటుంబంగా భావించి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన యోధుడు, వీరుడు, ఏకైక వ్యక్తి జగనన్న.
జగనన్నకు లభిస్తున్న ప్రజల అభిమానాన్ని, ప్రేమను తట్టుకోలేని దుష్ట కాంగ్రెస్ - దుర్మార్గ టిడిపి కుమ్మకై నీతిమాలిన రాజకీయ కుట్రలతో జైలుకు పంపారు. ప్రతి పేదవాడి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటోందన్న విషయం వారికి తెలియదు. ప్రజావ్యతిరేక ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉన్నా, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్రతో టైంపాస్ చేస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజాక్షేత్రంలో తానూ ఒక మనిషి అనే గుర్తింపు అయినా దక్కించుకుంటారు.
- వి.వి. శ్రీనివాస్యాదవ్, నకిరేకల్

జగనన్నకు లభిస్తున్న ప్రజల అభిమానాన్ని, ప్రేమను తట్టుకోలేని దుష్ట కాంగ్రెస్ - దుర్మార్గ టిడిపి కుమ్మకై నీతిమాలిన రాజకీయ కుట్రలతో జైలుకు పంపారు. ప్రతి పేదవాడి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటోందన్న విషయం వారికి తెలియదు. ప్రజావ్యతిరేక ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉన్నా, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్రతో టైంపాస్ చేస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజాక్షేత్రంలో తానూ ఒక మనిషి అనే గుర్తింపు అయినా దక్కించుకుంటారు.
- వి.వి. శ్రీనివాస్యాదవ్, నకిరేకల్
No comments:
Post a Comment